"వైసీపీ బస్సుయాత్ర బుస్సుయాత్రగా మారింది"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2023, 1:40 PM IST

Updated : Nov 15, 2023, 3:00 PM IST

thumbnail

TDP Leader Budha Venkanna on YSRCP Bus Yatra: వైసీపీ నాయకులు చేపట్టిన సామాజిక బస్సుయాత్ర బుస్సుయాత్రగా మారిందని.. టీడీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్​ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. బస్సుయాత్రపై ప్రజలలో ఉన్న వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనబడిందని.. అందువల్లే మూడుసార్లు యాత్రకు బ్రేక్​ వేశారన్నారు. 33మంది బీసీలను ఊచకోత కోయించి.. కేసులు లేకుండా చేసినప్పుడు జగన్​కు బీసీలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బీసీలను దగా చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని బుద్దా మండిపడ్డారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కలిసిన తర్వాత.. సీఎం జగన్​కు.. పులివెందులలోనూ ఓటమి భయం పట్టుకుందని అభిప్రాయపడ్డారు. జగన్​ మోహన్ రెడ్డి పిరికి పంద కాబట్టే 10నెలల క్రితం ఘటనలో ఇప్పుడు బీటెక్ రవిని అరెస్టు చేయించాడని మండిపడ్డారు. జగన్​ మోహన్ రెడ్డి జాతకం బాలేదు కాబట్టే చంద్రబాబు జోలికి వచ్చాడన్నారు. చంద్రబాబు రాశిఫలం బాలేదని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను బుద్దా ఖండించారు. 

Last Updated : Nov 15, 2023, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.