నన్ను అంతమొందించేందుకు జగన్ కుట్ర పన్నారు: బీటెక్‌ రవి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 6:55 PM IST

Updated : Dec 30, 2023, 6:31 AM IST

thumbnail

TDP Leader Btech Ravi Fires on CM Jagan on Removal of Gunmen: ముఖ్యమంత్రి జగన్ తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్​ఛార్జి బీటెక్ రవి ఆరోపించారు. అందుకే తనకున్న ఇద్దరు గన్​మెన్​లను తొలగించారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి కూడా తనకు గన్​మెన్ల సౌకర్యం ఉందని, ఇపుడు జగన్ తొలగించడం కుట్రలో భాగమేనని ఆరోపించారు. తనకు ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 

తనకు గన్​మెన్లు తొలగించిన వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ వేస్తానన్నారు. భద్రత లేకపోతే ప్రజల్లోకి వెళ్లలేననే భ్రమను వైసీపీ నాయకులు వీడాలన్నారు. ఎమ్మెల్యేలను మార్చుతున్న జగన్ మోహన్ రెడ్డి పులివెందుల స్థానం నుంచి మారకుండా చూడాలని చురకలు అంటించారు. జగన్ పోటీ చేస్తున్నారనే పులివెందుల ప్రజలకు ఆయన చేసిన అన్యాయాలు, అరాచకాలను ప్రజలకు వివరించాలనే ప్రయత్నం చేస్తుంటే, ఆయన తప్పుకుంటే ఎలా అని వ్యాఖ్యానించారు. జగన్‌ వేరే స్థానం నుంచి పోటీ చేస్తే తనకు కూడా అక్కడే అవకాశం ఇవ్వాలని చంద్రబాబుని కోరతానని తెలిపారు.

Last Updated : Dec 30, 2023, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.