సంక్రాంతి వేళ జోరుగా సాగుతున్న పోటీలు - భారీగా తరలివస్తున్న ప్రజలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 15, 2024, 7:35 PM IST

thumbnail

Sankranti Celebrations in Andhra Pradesh: సంక్రాంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగుతున్నాయి. పలుచోట్ల పొట్టేల పోటీలు,  ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహిస్తున్నారు. పందేల కోసం భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. పందేలు వేసేందుకు ఇతర జిల్లాల నుంచి సైతం పందెం రాయుళ్లు తరలివస్తున్నారు. 

నలుమూల నుంచి తరలి వచ్చిన పందెం రాయళ్లను ఆకర్షించే విధంగా నిర్వహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. పోటీలను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పలుచోట్ల ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. అదే విధంగా ఎద్దులబండి చక్రాలు తిరగకుండా తాళ్లతో కట్టి వినూత్నంగా పోటీలు నిర్వహిస్తున్నారు. వీటినే ఎద్దుల గిరకి పోటీలు అంటారు. సాధారణ పోటీలకు భిన్నంగా ఎద్దులబండి చక్రాలు తిరగకుండా తాళ్లతో కట్టి బండిని లాగించడం గిరకి పోటీల ప్రత్యేకత. ఇలా రాష్ట్రంలోని పలుచోట్ల వివిధ పోటీలు, పందేలను ఏర్పాటు చేశారు. సంక్రాంతికి తమ సొంతూళ్లకి వెళ్లిన ప్రజలు వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.