Protest at Jagananna Arogya Suraksha Program: మూడేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఈ శిబిరాల వల్ల ఏం ఉపయోగం.. సామాన్యుడి ఫైర్
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2023, 2:50 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-10-2023/640-480-19861797-thumbnail-16x9-protest-at-jagananna-arogya-suraksha-programee.jpg)
Protest at Jagananna Arogya Suraksha Program : సీఎం జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలు అనారోగ్యంతో బాధ పడకుండా ఉండేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు విస్తృతం చేయడంతో పాటు... దేశానికి ఆదర్శం అని ప్రచారం చేశారు. కానీ, ప్రజాక్షేత్రంలో మాత్రం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ప్రజలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఓ బాధితుడు నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పత్తికొండ పట్టణంలోని నాలుగో సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని (Jagananna Arogya Suraksha Program) అధికారులు నిర్వహిస్తున్నారు. శిబిరం వద్దకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, కుమారుడికి ఆరోగ్యం బాగా లేదని మూడు సంవత్సరాలుగా అధికారులు, ఆసుపత్రుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఎవరూ కనికరించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి శిబిరాల వల్ల ఏం ఉపయోగం అని నిలదీశారు.
TAGGED: