తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ నేతలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 1:33 PM IST
Politicians In Tirumala Temple: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రముఖ రాజకీయ నాయకులు (political Leaders) ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ (Union Minister Satyapal Singh Baghel), మంత్రి రోజా (Minister Roja), తెలుగుదేశం నేత కేశినేని నాని (TDP MP kesineni Nani), విశాఖ ఎమ్మెల్యే గణబాబు (Vizag MLA Ganababu) స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devastanam) ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు స్వామివారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
TDP MP kesineni Nani, Union Minister Satyapal Singh Baghel: అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని, మెుక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు.