Paderu MLA Faced Protest From YSRCP Leaders: వైసీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన సొంత పార్టీ నేతలు.. జీఓ నెం.3 పై ఎవరూ సంతకం పెట్టమన్నారంటూ నిలదీత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2023, 8:44 PM IST

thumbnail

Paderu MLA Faced Protest From YSRCP Leaders : అల్లూరి జిల్లాలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి స్వంత పార్టీ నుంచి నిరసన సెగ తగిలింది. జీఓ నెంబర్ 3 పై సొంత పార్టీ నేతలే నిలదీశారు. జిల్లాలోని మాడుగుల మండలం పులుసుమామిడి పంచాయతీ పరిధిలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ క్రమంలో జీఓ నెంబర్​పై వైసీపీ మద్దతుదారుడైన పులుసుమామిడి గ్రామ వార్డు సభ్యుడితోపాటు, గ్రామస్థులు  ఎమ్మెల్యేను నిలదీశారు. ఓట్లు వేయమని అభ్యర్థించిన వారి వద్ద మోహం చూపెట్టుకోలేకపోతున్నామని ఆయన అవేదన వ్యక్తం చేశారు.  జీఓ నెంబర్3 పై ఎలా సంతకం చేశారని ప్రశ్నించగా.. సమాధానమివ్వకుండా అతడ్ని నీది ఏ పార్టీ, ఏ ఊరని ఎమ్మెల్యే తిరిగి ప్రశ్నించారు. దీంతో నాది వైసీపీ పార్టీనే, తోకగరువు గ్రామమని బదులు ఇచ్చారు. జీఓ నెంబర్ 3 ని ఎవరూ రద్దు చేశారో సమాధానమివ్వాలని ప్రశ్నించిన వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు తెలిసి తెలియకుండా అడుగుతున్నారని.. జీఓ నెంబర్ 3 కేవలం గిరిజనులకు వంద శాతం ఉపాదిని కల్పించేదని చెప్పారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.