యువగళంలో ఐటీ ఉద్యోగులు- 'ఐటీ మంత్రిగా లోకేశ్​ సేవలు కావాలి'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 6:53 PM IST

thumbnail

Nara Lokeah Yuvagalam In Visakhapatnam : నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సాగిన ప్రతి అడుగులోనూ తెరవెనుక కీలకపాత్ర వారిదే. ఎదురొచ్చే అడ్డంకులను అధిగమింప జేయటంలో చురుగ్గా వ్యవహరించారు. ఏ రోజుకారోజు అడుగు ప్రారంభించి అడుగు ఆపే వరకు ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా మార్గం సుగమం చేశారు. అలా లోకేశ్ యువగళం పాదయాత్ర వెనుక 14 బృందాలు సమన్వయంతో పనిచేశాయి. ఆ కమిటీ సభ్యుల స్పందన ఇలా ఉంది.

IT Employees in Yuvagalam Padayatra : నారా లోకేశ్​ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు వారికి మంచి జీవితం ఉందని యువగళంలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తే తాము సొంత రాష్ట్రంలో ఉండగలుగుతామని, ఉద్యోగాల కోసం ఇతర దేశాలు, రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన అవసరం రాదని ఆశాభావం వ్యక్తం చేశారు. యువగళంలో పాల్గొనడానికి హైదరాబాద్​లోని ఐటీ ఉద్యోగులే కాకుండా లండన్, బెంగళూరు, చెన్నై​ వంటి తదితర ప్రాంతాల్లో జీవనోపాధి కోసం వెళ్లిన చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.