లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి పూజలు : పాల్గొన్న నందమూరి కుటుంబ సభ్యులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 6:03 PM IST

thumbnail

Nandamuri Vasundhara  Kartika Purnami pujas at Lakshmi Narasimha Swamy Temple: కార్తీక పౌర్ణమి సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర (Nandamuri Vasundhara )శ్రీసత్యసాయి జిల్లాకు విచ్చేశారు. హిందూపురం నియోజకవర్గం(Hindupur Constituency)లోని చిలమత్తూరు మండలం కనుమ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కనుమ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నారా చంద్రబాబు నాయుడు,నందమూరి బాలకృష్ణ,కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల  చేయించారు.

Bala Krishna wife in Hindupur Constituency: ఆలయ ప్రాంగణంలోని దేవతా వృక్షాలకు వసుంధర ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక దీపం వెలగించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన శివలింగానికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలకు నందమూరి వసుంధర పసుపు ,కుంకుమ,చీరలతో సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్తీక వనభోజనాలు కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించి అందరితో పాటే భోజనం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.