టోల్ సిబ్బందిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17391623-225-17391623-1672806905873.jpg)
MLA Chinnaiah Attacks Toll Plaza Staff : తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ప్లాజా సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య దాడికి దిగారు. గత నెలలో ప్రారంభమైన మందమర్రి టోల్ప్లాజా వద్ద వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేస్తున్నారు. ఎమ్మెల్యే వాహనం అక్కడకు చేరుకోగానే టోల్ప్లాజా సిబ్బంది ప్రొటోకాల్ పాటించకుండా ఆయన పట్ల దురుసుగా వ్యవహరించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కారు దిగి.. రహదారి పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రజల నుంచి టోల్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారంటూ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. టోల్ప్లాజా సిబ్బందే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని స్పష్టం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST