కృష్ణానది రక్షణ గోడ నిర్మించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే : మంత్రి పెద్దిరెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 6:27 PM IST

thumbnail

Minister Peddireddy Ramachandra Reddy: విజయవాడలో కృష్ణానది రక్షణ గోడ నిర్మించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కరకట్టను నిర్మించడానికి ముందుకు రాలేదని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. సీఎం జగన్ విజయవాడపై ప్రత్యేక శ్రద్దతో  వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేశారని పెద్దిరెడ్డి వెల్లడించారు.

విజయవాడ కనకదుర్గ నగర్, అయ్యప్ప నగర్లో కొత్తగా నిర్మించిన మూడు విద్యుత్ సబ్ స్టేషన్లను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్ పద్మా జనార్దనరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు కేవలం నినాదాలు చేయడం కాదని... తమ అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపాలని మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.