Lokesh Yuvagalam: యువగళం ప్రజాగర్జన చూసి జగన్ కి నిద్రపట్టడం లేదు: లోకేశ్

By

Published : Jun 5, 2023, 10:19 PM IST

Updated : Jun 6, 2023, 6:27 AM IST

thumbnail

Lokesh Yuvagalam at Kamalapuram: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం లో కొనసాగుతోంది. చెన్నూరులో లోకేష్ బహిరంగ సభ నిర్వహించారు. కడప గడ్డపై యువగళం ప్రజాగర్జన చూసి జగన్​కి నిద్రపట్టడం లేదని.., దీంతో కోడిగుడ్లతో దాడికి ఉసిగొల్పాడని ధ్వజమెత్తారు. వైసీపీ సైకో బ్యాచ్​కి షాక్ ట్రీట్​మెంట్​ ఇచ్చే సమయం దగ్గర్లో ఉందని హెచ్చరించారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్న తరువాతే చంద్రబాబు.. 'భవిష్యత్​కు గ్యారెంటీ' పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారన్నారు. కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు.. అహంకారం, అవినీతి, భూకబ్జాలు ఫుల్లు అని మండిపడ్డారు. ఇసుక, మట్టి, గ్రావెల్ దందా, భూకబ్జాలకు కమలాపురాన్ని కేరాఫ్​ అడ్రస్​గా రవీంద్రనాథ్​రెడ్డి మార్చేశాడని ఆరోపించారు. కమలాపురంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు వేసి అభివృద్ధి చేసింది టీడీపీ అని తెలిపారు. సభ జరుగుతున్న సమయంలో నమాజ్ జరగడం విని కాసేపు లోకేష్ తన ప్రసంగాన్ని ఆపారు. 

Last Updated : Jun 6, 2023, 6:27 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.