Lokesh Going to Delhi: దిల్లీకి లోకేశ్​.. సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై విచారణ నేపథ్యంలో..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 1:53 PM IST

thumbnail

Lokesh Going to Delhi: సుప్రీం కోర్టులో సోమవారం చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై విచారణ నేపథ్యంలో.. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ దిల్లీ వెళ్లారు. న్యాయవాదులకు అందుబాటులో ఉండాలని లోకేశ్​ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయన  రాజమహేంద్రవరం నుంచి దిల్లీ బయలుదేరి వెళ్లారు. లోకేశ్​తో పాటు రాజమండ్రి విమానాశ్రయం వరకు వెళ్లిన బ్రాహ్మణి అక్కడి నుంచి హైదరాబాద్ వరకు లోకేశ్​తో బయలుదేరారు. హైదరాబాద్​ మీదుగా లోకేశ్​ దిల్లీకి పయనమయ్యారు. 

తాజా రాజకీయ పరిణామాలు.. పరిస్థితులపై సీనియర్​ నేతలు, యువ నాయకులతో లోకేశ్​ చర్చించారు. అంతేకాకుండా న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలు.. భవిష్యత్​ కార్యాచరణపై ఎంపీ కనకమేడల, బుచ్చయ్య, మాగంటి బాబుతో సమావేశమయ్యారు. అనంతరం లోకేశ్​ దిల్లీకి బయల్దేరి వెళ్లారు. మరోవైపు 'కాంతితో క్రాంతి' కార్యక్రమంలో పాల్గొనాలని లోకేశ్​ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. లోకేశ్​ ఈ కార్యక్రమంలో దిల్లీలోనే పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. రాత్రి 7 నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేసిన నిరసన వ్యక్తం చేయాలని.. కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ వేసి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించడానికే ఈ కార్యక్రమం అని వివరించారు. 'బాబుతో నేను' అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలంటూ సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.