Lokesh Completed 2300 Kms padayatra: యువగళంలో మరో మైలురాయి.. 2,300 కి.మీ పూర్తి చేసుకున్న లోకేశ్​ పాదయాత్ర

By

Published : Aug 3, 2023, 9:37 PM IST

thumbnail

Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర 2 వేల 300 కిలోమీటర్ల మైలురాయికి దాటింది. 174వ రోజు పాదయాత్రను.. పల్నాడు జిల్లా నగరాయపాలెం క్యాంప్ కేంద్రం నుంచి కొనసాగించారు. కొండ్రముట్లకు వచ్చేసరికి పాదయాత్ర 2 వేల 300 కిలోమీటర్ల మైలురాయి చేరుకోగా.. వరికపూడిశెల ఎత్తిపోతల పథకం శిలాఫలకాన్ని లోకేశ్ ఆవిష్కరించారు. లక్షా 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే వరికపూడిశెల ఎత్తిపోతల పథకం వల్ల బొల్లాపల్లి మండలంలో ప్రజల సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని లోకేశ్​ తెలిపారు. కొచ్చెర్లలో డ్రైనేజీ అస్తవ్యస్థంగా ఉందని, సురక్షిత నీటికోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని.. ఎస్సీలకు కమ్యూనిటీ హాలు నిర్మించాలని గ్రామస్థులు లోకేశ్​కు వినతిపత్రం అందించారు. అంగలూరులో అరటితోట వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న అరటిగెలలను లోకేశ్​పరిశీలించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక పిల్లలను చదివించుకోవడం కూడా కష్టంగా మారిందని.. వనికుంట వాసులు లోకేశ్‌కు మొర పెట్టుకున్నారు. 174వ రోజు 13.9 కిలోమీటర్లు నడిచిన లోకేశ్‌.. వనికుంట వద్ద విడిది చేశారు. సాక్షి కథనాలపై మంగళగిరి కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్న కారణంగా శుక్రవారం పాదయాత్రకు లోకేశ్‌ విరామం ప్రకటించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.