ఆ విషయంలో అభినందించాల్సిందే - బాలినేనిపై నాదెండ్ల మనోహర్ సెటైర్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 5:49 PM IST

Updated : Dec 10, 2023, 7:55 PM IST

thumbnail

Janasena Nadendla Manohar on Balineni Comments: వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి సొంత పార్టీపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే బాలినేని వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. అవినీతికి పాల్పడ్డాను అంటూ వైసీపీ మాజీ మంత్రి ఒప్పుకున్నందుకు ఆయన నిజాయితీని అభినందించాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. 

వైసీపీలో ఒక ముఖ్యమైన మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడారని, అవినీతి జరిగిందని చెప్తున్నారని నాదెండ్ల అన్నారు. అయితే అది మాత్రమే సరిపోదని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఎంత అవినీతికి పాల్పడ్డారన్నది చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో జనసేన పార్టీ సమావేశంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పశు సంవర్థక శాఖలో వేల కోట్ల అవినీతి జరుగుతుందని, వైసీపీది పాలవెల్లువ కాదు పాపాల వెల్లువ అని నాదెండ్ల దుయ్యబట్టారు.

Last Updated : Dec 10, 2023, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.