అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న రైల్వే పోలీసులు - 64 కిలోలు స్వాధీనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 4:34 PM IST

thumbnail

Illegally Ganja Transporting in Anantapur District : అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్​లో అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి గోవాకు అక్రమ రవాణా చేస్తున్న గంజాయి నిందితులను ఆర్పీఎఫ్, జీఆర్​పీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.8.69 లక్షల విలువ చేసే 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జీఆర్​పీ సీఐ నగేశ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒరిస్సాకు చెందిన శిబిరాం ప్రధాన్​తో పాటు మరో వ్యక్తి కలిసి ఒరిస్సాలోని బరంపూర్ నుంచి గోవాకు గంజాయిని తీసుకెళ్లడానికి గుంతకల్ రైల్వే స్టేషన్​లో దిగారు. 

అక్కడి నుంచి గోవా రైలు ఎక్కడానికి చేస్తున్న ప్రయత్నంలో పోలీసులను చూసి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయట పడింది. వీరిలో ఒక వ్యక్తి పట్టుపడగా మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుడు శిబిరాం ప్రధాన్ ఒరిస్సా నుంచి గోవాకు గంజాయి తీసుకెళ్తే అతనికి రూ.15 వేలు ఇస్తారని విచారణలో తెలిందని సీఐ నగేశ్ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.