కాలపరిమితి పూర్తైన బిల్లులతో అక్రమంగా ఇసుక తరలింపు-మాజీ ఎమ్మెల్యే

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 9:44 AM IST

thumbnail

Former MLA Stopped The Lorries Illegally Transporting Sand In Krishna River: ఎన్టీఆర్ జిల్లా చెవిటికల్లు వద్ద కృష్ణా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జనసేన నాయకులు అడ్డుకున్నారు. కృష్ణా నది నుంచి ప్రతిరోజు అక్రమంగా లారీల్లో ఇసుక తరలిస్తున్నారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.. కృష్ణా నది వద్దకు వెళ్లారు. అక్రమంగా వెళుతున్న లారీలను గుర్తించి వాటిని అడ్డుకుని అనుమతులు ఏమున్నాయో చూపించాలని ప్రశ్నించారు. లారీ డ్రైవర్లు జేపీ కంపెనీ పేరుతో ఉన్న కాగితాలు చూపించటంతో కాలపరిమితి పూర్తైన జేపీ కంపెనీ పేరుతో ఉన్న బిల్లులతో ఇసుకను ఎలా తరలిస్తారని ఆమె నిలదీశారు.

 ఇసుక అక్రమ రవాణాతో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ నాగేంద్రకుమార్​..  వెంటనే లారీలను తమకు అప్పగించి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనటంతో  సౌమ్య, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలపై కేసు నమోదు చేసి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.