Land Issues: భూముల్ని కబ్జా చేసిన వైసీపీ నేత.. రోడ్డెక్కిన అన్నదాతలు

By

Published : May 22, 2023, 10:20 PM IST

thumbnail

Land issues in visakhapatnam: విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నారాయణరాజుపేటలో భూ రికార్డుల మార్పిడిలో వైసీపీ నేత పెద్ద ఎత్తున పేరున మార్చేశారని రైతులు ఆరోపించారు. దానికి భీమిలి ఎమ్మెల్యే మద్దతు పలుకుతున్నారని రైతులు, నేతలు ఆరోపించారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో  విశాఖ జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్​కు రైతులు తమ గోడును రాతపూర్వకంగా అందించారు. గతంలో ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో సైతం తమ ఫిర్యాదులను ఇచ్చామని రైతులు వెల్లడించారు. అయినా తమకు న్యాయ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ రోజు ఉదయం నుంచే భీమునిపట్నం మండలం నారాయణరాజుపేట రైతులు పెద్ద సంఖ్యలో విశాఖ కలక్టరేట్​కు చేరుకున్నారు. తమ నిరసన వ్యక్తం చేశారు. ఎక్కువ సంఖ్యలో వచ్చిన రైతులను సామూహికంగా స్పందన వద్దకు పంపేందుకు పోలీసులు అనుమతించలేదు. రైతుల తరుఫున ప్రతినిధులుగా కలెక్టరెట్​లోకి  కొందరిని మాత్రమే  పంపారు. దశాబ్దాలుగా రైతుల పేరిట ఉండే భూముల రికార్డులన్నీ హఠాత్తుగా ఆన్​లైన్లో వైసీపీ నేత పేరిట ఎలా మారిపోయాయని వారు ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ చేసి తమకు న్యాయం చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు  డిమాండ్ చేశారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.