Dussehra Celebrations Across the State రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఆకట్టుకుంటున్న కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2023, 5:08 PM IST

thumbnail

Dussehra Sharannavaratri Celebrations Across the State: రాష్ట్ర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆఖరి రోజు కావడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. దసరా సందర్భంగా పలు జిల్లాల్లో దుర్గామాత పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మడివరంలో పది లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. పట్టువస్త్రాలు, బంగారు నగలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరు జిల్లాలో విజయదశమి సందర్భంగా అమ్మవార్ల ఆలయాల్లో భారీగా భక్తులు వచ్చి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు చివరిరోజు కావడంతో.. వేలాది మంది భవాని భక్తుల దీక్షలతో.. దుర్గాదేవి ఆలయాలన్నీ కిటకిటలాడాయి. కేంద్రపాలిత ప్రాంతం యానంలో అమ్మవార్లను ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. అన్నవరం దేవస్థానంలో దసరా సందర్భంగా సత్యదేవునికి నూతన సేవను ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో అమ్మవార్ల వేషధారణలో, నృత్యాలతో.. కళాకారులు భక్తులను అలరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.