రాజకీయాల కోసమే వైఎస్ మృతిని మళ్లీ తెరపైకి తెచ్చారు: మస్తాన్ వలీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2024, 1:26 PM IST

thumbnail

Congress Leader Mastan Wali Allegations on Sajjala Ramakrishna: వైఎస్‌ షర్మిలను విమర్శించే అర్హత సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మండి పడ్డారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో (YS Sharmila joined Congress) చేరడంతో వైసీపీ పార్టీలో భయం పట్టుకుందని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిందని ఒక్క జగన్ మాత్రమే ఆ పార్టీని వీడారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ఇందిరమ్మ ఉన్నంత కాలం ఇందిరమ్మ ఆశయ సాధనకు కృషి చేశారని అన్నారు. తండ్రి కలలను షర్మిల నిజం చేసేందుకే కాంగ్రెస్​లోకి వచ్చారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై అనుమానాలున్నాయని అంటున్న సజ్జల ఈ ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని మస్తాన్ వలీ నిలదీశారు. కేవలం రాజకీయాల కోసమే వైఎస్ మృతిని మళ్లీ తెరపైకి తెచ్చారని విమర్శించారు. మీ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.