జగన్ పిలుపుతో తాడేపల్లికి వరుస కట్టిన ఎమ్మెల్యేలు - వీరికి టికెట్ డౌటే!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 7:41 PM IST

thumbnail

CM Jagan working on the changes of MLA candidates: సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చిదంటే చాలు వైఎస్సార్సపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. ఎవ్వరి సీటు ఉంటుందో ఎవ్వరిది సీటు చిరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సీఎం జగన్ నుంచి పలువురు ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది. సీఎం నుంచి పిలుపు రాగానే వైఎస్సార్సీపీ నేతలంతా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వరుస కట్టారు. 

 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ ఇన్‌ఛార్జ్‌ల మార్పులపై సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం జగన్ నుంచి పిలుపు రాగా, వారంతా తాడేపల్లికి చేరుకున్నారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ను ఎమ్మెల్యేలు, నేతలు కలుస్తున్నారు. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి , కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్ సీఎం జగన్‌ను కలిశారు. కనిగిరి పార్టీ ఇన్‌ఛార్జ్‌ మార్పుపై సీఎం జగన్‌ చర్చిస్తున్నట్లు తెలిసింది. మార్కాపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జి మార్పుపై సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. ఇన్‌ఛార్జ్‌గా జంకె వెంకట్‌రెడ్డి పేరు దాదాపు సీఎం ఖరారు చేశారు. ఇప్పటికే ఆయన్ని పిలిపించి సీఎం జగన్‌ మాట్లాడారు. అదే సమయంలో సీఎం జగన్‌ను  ప్రస్తుత ఎమ్మెల్యే మార్కాపురం నాగార్జున రెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.