CID Case of Amaravati Assigned Lands : చంద్రబాబు, నారాయణపై సీఐడీ కేసు... తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 1:29 PM IST

thumbnail

CID Case of Amaravati Assigned Lands : రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల విషయంలో సీఐడీ తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు న్యాయవాదులు రాతపూర్వకంగా వాదనలను కోర్టుకు సమర్పించారు. దీంతో తీర్పును వాయిదా(రిజర్వు) వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ ప్రకటించారు. అసైన్డ్‌ భూముల విషయంలో ఉల్లంఘటను చోటు చేసుకున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరిలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ 2021 మార్చిలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణపై ఎస్సీ ఎస్టీ చట్టం, ఎసైన్డ్‌ భూముల బదిలీ నిషేధ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కేసును కొట్టేయాలంటూ వారిరువురూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేయగా.. 2021 మార్చి 19న న్యాయస్థానం విచారణ జరిపింది. కేసు దర్యాప్తులో తదుపరి చర్యలన్నింటిని నిలుపుదల చేసింది. ఇటీవల ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తుది విచారణ ప్రారంభించింది. అందులో భాగంగా పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. తాజా విచారణలో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.