కనిగిరిలో రెండోరోజు చంద్రబాబు పర్యటన - అన్నా క్యాంటీన్‌ పైలాన్ ఆవిష్కరణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2024, 2:05 PM IST

thumbnail

Chandrababu Second Day Tour in Prakasam District: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజులుగా ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జిల్లాలోని కనిగిరిలో ఏడదికాలంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కన ఇన్చార్జి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్​ను చంద్రబాబు పరిశీలించారు. ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా చంద్రబాబు స్వయంగా వచ్చిన వారికి భోజనాలు వడ్డించారు. 

అన్నా క్యాంటీన్ ప్రథమ వార్షికోత్సవ పూర్తయిన సందర్భంగా పైలాన్​ ఆవిష్కరించారు. జిల్లాలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలను, ఇన్​ఛార్జీలను బస్సులోకి పిలిపించి వారితో ముఖాముఖి మాట్లాడారు. చంద్రబాబు కోసం వచ్చిన కార్యకర్తలతో ఫొటోలు దిగి ఉత్సాహపరిచారు. వైఎస్సార్​సీపీ నుంచి కొంతమంది నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరగా చంద్రబాబు వారికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రూపొందించిన పాటలు సీడీని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు హెలికాప్టర్​లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.