మస్తాన్​వలీ ముంచేశాడుగా! - ₹ 58 లక్షలు ఖాతాలో వేసుకున్న బ్యాంక్ క్యాషియర్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 1:25 PM IST

thumbnail

Bank Cashier Fraud in Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్​లో క్యాషియర్ చేతి వాటం ప్రదర్శించారు. ఏకంగా 58 లక్షల రూపాయల సొమ్ము స్వాహా చేశాడు. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం చిలకలూరిపేటకు చెందిన ఎస్​కే మస్తాన్ వలీ మచిలీపట్నం బ్రాంచ్​లో క్యాషియర్​గా పని చేస్తున్నాడు. ఇటీవల బ్యాంక్​లో అంతర్గత ఆడిట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా బ్యాంకులో ఉండాల్సిన మొత్తంలో 58 లక్షల రూపాయలు తేడా కనిపించింది. దీనిపై బ్యాంక్ అధికారులు విచారించగా గడిచిన మూడు నెలలలో మూడు విడతలుగా ఆ మొత్తం క్యాషియర్ మస్తాన్ వలీ ఖాతాకు జమ అయినట్లు గుర్తించారు. మస్తాన్ వలీని బాధ్యుడిగా చేస్తూ బ్యాంక్​ మేనేజర్ ఆర్​పేట పోలీస్ స్టేషన్​లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన మస్తాన్ వలీ ఏడాది క్రితం బదిలీపై మచీలపట్నం బ్రాంచ్​కు క్యాషియర్​గా వచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.