కోడికత్తి గాయానికి జగన్ హైదరాబాద్ వెళ్లలేదా సజ్జలా ?: అశోక్బాబు
Ashok Babu Fires on Jagan and Sajjala : జగన్ పాలనలో సత్యం మరుగున పడటం, అసత్యం అందలం ఎక్కడం, సజ్జల లాంటి వ్యక్తి అసత్యాలు చెప్పడం పెద్ద విచిత్రమేమీ కాదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. చంద్రబాబు హైకోర్టు ఆదేశాలు, బెయిల్ నిబంధనలు గౌరవిస్తూ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యానే, సంయమనంతో ఉంటున్నారని సకల శాఖల సలహాదారు గ్రహించాలని హితవు పలికారు. చంద్రబాబుకు బెయిల్ రావడం జగన్ రెడ్డికి, సజ్జలకు ఇష్టం లేదని వారి మాటలే చెబుతున్నాయని మండిపడ్డారు. ఏఐజీ ఆస్పత్రిని తప్పుబట్టే స్థాయి, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత సజ్జలకు లేవని ఆక్షేపించారు.
Paruchuri Ashok Comments On CM and Sajjala : పద్మవిభూషణ్ గ్రహీత నాగేశ్వర్ రెడ్డిని ఏఐజీ ఆసుపత్రిని తప్పుపట్టే స్థాయి, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత సజ్జలకు లేవని ఆక్షేపించారు. చంద్రబాబు బెయిల్ విషయంలో హైకోర్టు నిబంధనలు తెలుసుకునే మాట్లాడావా సజ్జలా అని ప్రశ్నించారు. ఎలాంటి ప్రత్యేకత ఉందని జగన్ రెడ్డి తనపై ఉన్న అవినీతికేసుల విచారణకు హాజరుకావడం లేదో సజ్జల చెప్పాలని విమర్శించారు. కోడికత్తితో గాయానికి ఆంధ్రాలో వైద్యం చేసేవారు లేరని ఆనాడు జగన్ హైదరాబాద్ కు వెళ్లాడా సజ్జలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ హత్యకేసు నుంచి అవినాశ్ రెడ్డిని, కోడికత్తి కేసు నుంచి తనను రక్షించుకోవడానికి జగన్ రెడ్డి ఆడుతున్న నాటకాలు ఎన్నాళ్లు కప్పిపుచ్చుతావు సజ్జలా అని ఎద్దేవా చేశారు.