AP tribal young woman in Indian blind cricket team : అంధుల క్రికెట్ జట్టులో ఏపీ యువతి.. స్వగ్రామంలో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 5:08 PM IST

thumbnail

AP tribal young woman in Indian blind cricket team : ఇంగ్లండ్ బర్మింగ్హామ్ లో జరిగిన మహిళల అంధుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం తెలిసిందే. ఈ విజయంతో అంధ క్రీడాకారుల్లో(Blind athletes) ఆనందం వెల్లివిరిసింది. కాగా, ఈ జట్టులో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన వారిలో పాడేరు ఏజెన్సీకి చెందిన ఓ యువతి ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రంగసింగిపాడులో గోపాలకృష్ణ, చిట్టెమ్మ దంపతుల కుమార్తె రవణి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. వైజాగ్ భీమిలి వద్ద వనజ అంధ ఆశ్రమంలో చదువుకున్న రవణి (Ravani).. హైదరాబాద్ లో అదే ఆశ్రమం ప్రధాన బ్రాంచ్ లో ఉంటూ ఇంటర్ చదువుతోంది. గ్రామంలో చిన్నపురిపాక పాఠశాలలో 5 వరకు చదువుకుంది. తమ గిరిజన బాలిక అంధురాలైనప్పటికీ ఇలా భారత క్రికెట్ జట్టు (Indian cricket team) కు ప్రాతినిధ్యం వహించడం తమ అందరికీ ఎంతగానో ఆనందదాయకమని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా ఈ గ్రామాన్ని సందర్శించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.