ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలిపు పిటిషన్లపై హైకోర్టు విచారణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 10:19 PM IST

thumbnail

AP HC Hearing on Camp Office Shifting to Vizag:  సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. బుధవారం వ్యాజ్యాల మెరిట్స్‌పై వాదనలు వింటామని హైకోర్టు సింగిల్‌ జడ్జి తెలిపారు. వ్యాజ్యాలను ఫుల్‌ బెంచ్‌ వద్దకు పంపాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పైనా తగిన ఉత్తర్వులిస్తామని వెల్లడించారు. సీఎం క్యాంపు కార్యాలయం తరలింపునకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలిపివేయాలని కోరుతూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్ వాదనలు వినిపించారు. త్రిసభ్య ధర్మాసనం మాత్రమే ఈ పిటిషన్లపై విచారణ జరపాలని ప్రభుత్వ తరపు ఏజీ శ్రీరామ్ వాదించారు.

రైతుల ఆరోపణలు: ముఖ్యమంత్రి, మంత్రులు విశాఖకు వెళ్లాలనుకుంటున్నారని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.  విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మించిన మిలీనియం టవర్స్​లో చాలా భాగాన్ని, రాజధానిని అక్కడికి తరలించే దురుద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఇన్నేళ్లూగా అక్కడ ఖాళీగా పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. దానిని ఇప్పుడు అమల్లో పెడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గత కొంత కాలంగా వైసీపీ మంత్రులు, ముఖ్యనేతలు రాజధాని తరలిపుపై వాఖ్యాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేఫథ్యంలో రాజధాని రైతుల్లో ఆందోళన నెలకొంది. అందుకే ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై జీవోను నిలిపివేయాలని కోరుతూ రైతులు కోర్టులో కేసు వేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.