Amaravati Farmers Complaint Against IAS Srilakshmi: కౌలు చెల్లించలేదని.. తుళ్లూరు పీఎస్​లో ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అమరావతి రైతుల ఫిర్యాదు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 3:55 PM IST

thumbnail

Amaravati Farmers Complaint Against IAS Srilakshmi: ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిపై రాజధాని రైతులు తుళ్లూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. భూములిచ్చిన రైతులకు మే నెల మొదటి వారంలో చెల్లించాల్సిన కౌలు, దసరా వచ్చినా చెల్లించనందున చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యాపార నిబంధనలు ప్రకారం నడుచుకోకుండా.. వాటికి విరుద్దంగా నిబంధనలను పాటించకుండా, వాటిని అమలు చేయకుండా తన అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారని.. బిల్లులను విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహించారని తెలిపారు. 

శ్రీలక్ష్మి చర్యల వల్ల రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా తమ విధులను మరిచి.. కక్షపూరితంగా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిధుల విడుదలకు జీవో జారీ అయినా.. రైతుల అకౌంట్లలో డబ్బులు వేయకపోవటాన్ని తప్పుబడుతూ సీఆర్పీసీ 166 ప్రకారం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. మొత్తం 22 వేల 948 రైతులకు దాదాపుగా రూ. 183.17 కోట్లు చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో రాజధాని రైతులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.