Allegations On MP Vanga Geetha : ఆస్తుల కోసం మా ఇంట్లో చోరీ చేయించారు.. ఎంపీ వంగా గీతపై సొంత వదిన ఫిర్యాదు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2023, 12:44 PM IST

thumbnail

Allegations Against MP Vanga Geetha : కాకినాడ ఎంపీ వంగా గీత, ఆమె మరిది తమ ఇంట్లో దొంగతనం చేయించారని ఎంపీ వదిన పుప్పాల కళావతి సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ కృతికాశుక్లాకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎంపీ గీత అన్నయ్య, తన భర్త పుప్పాల వెంకటవేణుగోపాల్‌ కృష్ణకుమార్‌ 2010లో మరణించారన్నారు. ఆయన బతికుండగానే మా ఆస్తులను ఎంపీ రాయించుకున్నారని ఆరోపించారు. ఆస్తుల కోసం మేం కేసులు వేసి, బయటకు లాగుతామని భావించి ఆర్థికంగా దెబ్బతీయడానికి మూడేళ్ల క్రితం మా ఇంట్లో దొంగతనం చేయించారన్నారు. 30 కాసుల బంగారం, నగదు పట్టుకుపోయారన్నారు. 

వారసత్వంగా వచ్చిన 6.5 ఎకరాల భూమి, 600 గజాల ఇంటిని ఎంపీ వంగా గీత అక్రమంగా రాయించుకున్నారన్నారు. గతంలోనూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. ఎస్పీకి లేఖ రాస్తానని చెప్పారన్నారు. ఎస్పీ కార్యాలయానికి అనేకసార్లు వెళ్లినా ఫలితం లేదన్నారు. తానూ వైసీపీ అభిమానినేనని, న్యాయం చేయాలని సీఎంను వేడుకుంటున్నానని కన్నీటిపర్యంతమయ్యారు. ఎంపీ అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆమె ప్లకార్డులతో నిరసన తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.