30వేల కోట్లు ఆస్తుల స్వాధీనం చేసుకుని 3వేల కోట్లు చెల్లించలేకపోతున్నారు ! ఈ చేతగానితనాన్ని ఏమనాలి - వామపక్షల నేతల ధ్వజం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 9:50 PM IST

thumbnail

Agrigold Victims Are Concerned : అగ్రిగోల్డ్​ కంపెనీకి 30 వేల కోట్లు ఆస్తులను స్వాధీనం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం మూడు వేల కోట్లను చెల్లించడానికి  మీనా వేషాలు లెక్కిస్తుందని పశ్చిమ గోదావరి సీపీఐ కార్యదర్శి కోనాల భీమారావు విమర్శించారు. తణుకు నియోజకవర్గంలో అగ్రిగోల్డ్​ బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన డిపాజిట్లు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు తెలిపాయి.

Help for Agrigold Victims : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన జగన్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పారని కోనాల భీమారావు విమర్శించారు. 20 వేల రూపాయలలోపు డిపాజిట్ దారులకు మాత్రమే చెల్లించారని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రతాప్​ వ్యాఖ్యానించారు. మిగిలిన 10 లక్షల మందికి పెద్ద మొత్తంలో ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరుకున్నారు. లేేకుంటే రాబోయే ఎన్నికల్లో జగన్​ ప్రభుత్వాన్ని గద్దె దించి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.