రెడ్డిపాలెంలో ఏకశిలా సుబ్రహ్మణ్య స్వామి వైభవం

By

Published : Mar 31, 2021, 7:24 PM IST

thumbnail

ప్రకాశం జిల్లా కృష్ణంరాజుపాలెంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఏకశిలా విగ్రహం ఆవిష్కరించనున్నారు. కొరిసపాడు మండలం రెడ్డిపాలెం (కృష్ణంరాజు పాలెం)లో షడ్మోణుఖాకారంలో 46 అడుగుల సుబ్రహ్మణ్య స్వామిని మే నెలలో ప్రతిష్టించబోతున్నారు. సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా వెలసిన తిరుచ్చెందూర్, ఫలణి, తిరుత్తణి, తిరుపరకుండ్రం, స్వామిమళై, ఫళముదిచోళై క్షేత్రాలు ఒకే చోట దర్శనిచ్చే విధంగా భారీ పీఠాన్ని నిర్మిస్తున్నారు. వీటి మధ్యలో 46 అడుగుల స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విగ్రహానికి కావలసి ఏక శిలను భారీ క్రైయిన్ల సాయంతో ప్రత్యేకించి ఇక్కడకు తెప్పించారు. తమిళనాడు నుంచి శిల్పులను ఇక్కడకు తీసుకువచ్చి గత ఏడాదిగా విగ్రహాన్నిచెక్కించారు. ఈ విగ్రహం తయారీ దాదాపు పూర్తయ్యింది. ప్రతిషించేందుకు ఏర్పాట్లు చేసారు. శివనాగకుమారి పర్యేవేక్షణలో సుమారు కోటిన్నర రూపాయల విరాళాలతో ఈ సుబ్రహ్మణ్య క్షేత్రం అభివృద్ధి చేస్తున్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.