amaravathi agitation: అమరావతి ఉద్యమం @ 600..ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తోన్న ఆందోళనలు 600 రోజుకు చేరుకున్నాయి. హైకోర్టు నుంచి మంగళగిరి దేవస్థానం వరకూ ర్యాలీకి సిద్ధమైన రాజధాని రైతులు, నిరసనకారులను.. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవటం ఉద్రిక్తతకు దారి తీసింది. శాంతియుతంగా కరోనా నిబంధనలు పాటిస్తూ... నిరసనగా తెలుపుతున్నా పోలీసులు దమనకాండ కొనసాగించటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.