ఉత్కంఠగా కౌంటింగ్​..అస్వస్థతకు గురైన తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి

author img

By

Published : Sep 19, 2021, 5:26 PM IST

కౌంటింగ్ హాల్​లోనే తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి అస్వస్థత

కౌంటింగ్​ మొదలైనప్పటి నుంచి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఫలితం ఎలా వస్తుందోనన్న టెన్షన్​ ఆమెను వెంటాడింది. తొలి రౌండ్​ నుంచి ఆమె ఆధిక్యంలో కొనసాగుతూనే ఉన్నారు. అయినా ఫలితం ఎలా ఉంటుందోనని ఆమె ఆలోచిస్తూనే ఉంది. ఉదయం నుంచి ఒత్తిడిలో ఉన్న ఆమె.. గెలిచినప్పటికీ ఆ వార్త విని మరింత ఉద్వేగానికి లోనై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

కడప జిల్లా గోపవరం మండలం బ్రాహ్మణపల్లె తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు ధనలక్ష్మి కౌంటింగ్ హాల్​లో అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఎన్నికల కౌంటింగ్ లెక్కింపు ప్రారంభం నుంచి విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. గెలిచినట్లు ఫలితం తెలియడంతో మరింత ఒత్తిడికి లోనయ్యారు. ఆమెను కౌంటింగ్ హాల్​లో నుంచి బయటికి తీసుకువచ్చారు. అనంతరం వైద్య సిబ్బంది ఆమెను పరిక్షించగా బీపీ ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. అనంతరం ఆమెను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

ఫైబర్‌నెట్‌పై బురదజల్లాలనే గౌరీశంకర్‌ని నియమించారు: రాజప్ప

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.