కడప శివారులోని బుడ్డాయి పల్లెలో శ్రీ హరి కెమికల్స్ కర్మాగారంలో తెల్లవారుజామున విద్యుదాఘాతంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ కర్మాగారంలో బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, యాసిడ్ తయారు చేస్తుండేవారు. బుడ్డాయి పల్లె చెందిన శ్రీహరి కుమార్ గత పదేళ్ల నుంచి కెమికల్స్ కర్మాగారాన్ని నిర్వహిస్తున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న వాచ్మెన్ వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారాన్ని చేరవేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికే అక్కడ ఉన్న సామాగ్రి కాలిపోయాయి.
సుమారు నాలుగు వేల బస్తాల బ్లీచింగ్ పౌడర్ నీటిలో తడిచిపోయాయి. అధికారులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూ 50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు కర్మాగారం నిర్వాహకుడు తెలిపారు.
ఇదీ చదవండి :