ETV Bharat / state

16 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్, మూడు వాహనాలు స్వాధీనం

author img

By

Published : Nov 27, 2022, 4:42 PM IST

Red sandalwood smugglers: వైయస్సార్ జిల్లా నుంచి.. అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లను.. బ్రహ్మంగారిమఠం పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తమిళనాడుకు చెందిన కొంతమంది స్మగ్లర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు.

red sandal
red sandal

Red sandalwood smugglers: వైఎస్సార్ జిల్లా నుంచి అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న 16 మంది స్మగ్లర్లను బ్రహ్మంగారిమఠం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద టన్ను ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లంకమల్ల అటవీ ప్రాంతంలో.. ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారంతో మైదకూరు డీఎస్పీ వంశీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో.. దుండగుల వాహనాలను వెంబడించి పట్టుకున్నారు. ఈ దాడుల్లో ప్రధాన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

వైయస్సార్ జిల్లా నుంచి అక్రమంగా ఎర్రచందనం రవాణా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.