ETV Bharat / state

తాత్కలికంగా అప్రోచ్​ రోడ్డు.. ఇప్పటికీ రెండుసార్లు తెగింది..!

author img

By

Published : Dec 14, 2022, 2:27 PM IST

People Faced Problem Due To No Bridge : వంతెన నిర్మాణంలో ప్రభుత్వ అలసత్వం 16 గ్రామాల ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు వరద పోటెత్తడంతో తాత్కాలిక వంతెనకు అధికారులు గండికొట్టారు. ఫలితంగా వైఎస్సార్​ జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Penna river near Jammalamadugu
జమ్మలమడుగు

మరమ్మతులకు నోచుకోని వంతెన, అవస్థలు పడుతున్న ప్రయాణికులు

People Faced Problem Due To No Bridge : గతేడాది కురిసిన భారీ వర్షాలకు వైఎస్సార్​ జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెన్నానదిపై ఉన్న వంతెన కుంగిపోయింది. దెబ్బతిన్న వంతెనస్థానంలో కొత్త వంతెన నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం.. తాత్కాలిక రాకపోకల కోసం సమీపంలో అప్రోచ్​ రోడ్డు నిర్మించారు. నది మధ్యలో మట్టితో నిర్మించిన ఈ రోడ్డు చిన్నపాటి వర్షాలకే రెండుసార్లు తెగిపోయింది. మాండౌస్​ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో పెన్నానదికి వరద పోటెత్తింది. అప్రోచ్​ రోడ్డు మీద రాకపోకలు ప్రమాదకరంగా మారడంతో.. అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా అప్రోచ్​ రోడ్డుకు గండికొట్టి నీటిని దిగువకు విడుదల చేశారు.

అప్రోచ్​ రోడ్డుకు గండికొట్టడంతో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం ఈ మార్గంలోనే పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టూ 40 కిలోమీటర్లు తిరిగి జమ్మలమడుగు చేరుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం వల్లే.. వర్షాలు వచ్చిన ప్రతిసారీ ఇబ్బందిపడుతున్నామని తెలిపారు.

"ఈ అప్రోచ్​ రోడ్డు సంవత్సరంలో ఇది మూడోసారి తెగిపోవటం. ఈ రోడ్డు తెగిపోవటం వల్ల దాదాపు 16 గ్రామాలకు జమ్మలమడుగు పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి ఈ అప్రోచ్​ రోడ్డును, వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాము." -ప్రయాణికుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.