ETV Bharat / state

కుందూకు భారీ వరద.. 12 గంటల్లోనే ప్రవాహం దాదాపు రెట్టింపు

author img

By

Published : Sep 20, 2020, 12:03 PM IST

కుందూనదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కేవలం 12 గంటల్లోనే వరద ప్రవాహం దాదాపు రెట్టింపు కావడంపై... పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ongoing-flooding-in-kunduk-river
కుందూనదికి కొనసాగుతున్న వరద

కర్నూలు కడప జిల్లాల మీదుగా ప్రవహించే కుందూనదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. నిన్న ఉదయం 25 వేల 561 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా సాయంత్రానికి 41 వేల 845 క్యూసెక్కులకు చేరుకుంది. ఈ రోజు ఉదయం 40వేల 509 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం 12 గంటల్లోనే అనూహ్యంగా వరద ప్రవాహం దాదాపు రెట్టింపైన పరిస్థితుల్లో.. ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చూడండి:

జోరు వానలకు పంటలు నీటిపాలు.. భోరుమంటున్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.