ETV Bharat / state

గువ్వలచెరువు ఘాట్​రోడ్​ వద్ద ప్రమాదం.. ఒకరు మృతి

author img

By

Published : Dec 19, 2020, 5:54 PM IST

Updated : Dec 19, 2020, 8:42 PM IST

one person died in road accident
ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం

కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్​రోడ్​ వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

కడప జల్లా రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో​ జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. రాయచోటి నుంచి కడప వెళ్లే కంటైనర్ లారీకి బ్రేకులు ఫెయిల్ కావటం వల్ల.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్నిఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ఈశ్వరయ్య(40) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్​ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చింతకొమ్మదిన్నె పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కడప రిమ్స్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఎస్సీ మహిళ హత్యాచార కేసులో అసలు నిందితులెవరు? వర్ల రామయ్య

Last Updated :Dec 19, 2020, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.