ETV Bharat / state

'రూ.130 కోట్లతో బద్వేల్ అభివృద్ధి'

author img

By

Published : Apr 10, 2021, 12:54 PM IST

badvel municipal meeting
బద్వేల్ మునిసిపాలిటీ సమావేశం

రూ. 130 కోట్లతో బద్వేల్ ను అభివృద్ధి చేయనున్నట్లు పురపాలక ఛైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ సమస్యలపై చర్చించారు.

కడప జిల్లా బద్వేలు మునిసిపాలిటీని రూ.130 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు పురపాలక ఛైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు భవన్​లో మొదటి కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

బద్వేల్ పురపాలికలోని 35 వార్డుల్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. రహదారులు, మురుగు కాలువల వ్యవస్థ మరమ్మతులకు అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ప్రతి వార్డులో పొడి, తడి చెత్త సేకరించనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

ఎల్​ఆర్ఎస్​కు వాహన చోదకులు బారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.