ETV Bharat / state

'పేదలకు త్వరలోనే విడతల వారీగా ఇళ్లు కట్టిస్తాం'

author img

By

Published : Jun 10, 2020, 7:30 AM IST

ఎంపీ మిథున్ రెడ్డి
ఎంపీ మిథున్ రెడ్డి

రైల్వే కోడూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ మిథున్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వైకాపా ఏడాది పాలనపై తెదేపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటించారు. యస్.కొత్తపల్లి, మైసూర్ వారి పల్లి, రైల్వే కోడూరు, కొత్త కోడూరులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని సరఫరా చేస్తామని ఎంపీ తెలిపారు. గాలేరు నగరి కాలువ త్వరలో పూర్తి చేస్తామన్నారు. రైల్వేకోడూరు పట్టణంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేసి ఉచితంగా మినరల్ వాటర్​ను సరఫరా చేస్తామని చెప్పారు.

తెదేపా నేతలు.. వైకాపా ఏడాది పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు సహకరించాలని కోరారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం తెదేపాకు ఇష్టంలేదని అందుకే కేసులు వేసి పేదలకు పట్టాలు దక్కకుండా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పేదలకు ఇళ్లపట్టాలతో పాటు విడతలవారీగా ఇళ్లు కట్టి ఇచ్చే కార్యక్రమం చేపడుతుందని ఎంపీ తెలిపారు.

ఇదీ చదవండి:

చిరుత- లేడి మధ్య వార్​.. చివరికి ఏమైంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.