ETV Bharat / state

వరదలో చిక్కుకున్న పది మంది విద్యుత్ సిబ్బంది సురక్షితం

author img

By

Published : Nov 26, 2020, 5:59 PM IST

కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో స్తంభాలను సరిచేయడానికి పొలాల్లోకి వెళ్లిన విద్యుత్ సిబ్బంది.. వరదలో చిక్కుకుపోయారు. ఇతర విద్యుత్ ఉద్యోగులు, అగ్నిమాపక సిబ్బంది.. వారిని కాపాడేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

electricity employees trapped in flood
వరదలో చిక్కుకున్న విద్యుత్ ఉద్యోగులు

విద్యుత్ పనులు చేయడానికి వెళ్లిన ఆ శాఖ సిబ్బంది వరద నీటిలో చిక్కుకుపోయారు. కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో జరిగిందీ సంఘటన. వరద ప్రవాహానికి దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను సరిచేయడానికి.. పది మంది సిబ్బంది పంట పొలాల్లోకి వెళ్లారు. పని ముగించుకుని వచ్చేసరికి పుల్లంగేరు కాలువ ఉదృతంగా ప్రవహించింది.

వరద ప్రవాహంలో బయటకు రాలేక ఉద్యోగులు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న ఇతర ఉద్యోగులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వాళ్లను రక్షించారు.

వరదలో చిక్కుకున్న విద్యుత్ ఉద్యోగులు

ఇదీ చదవండి:

బలహీన పడిన 'నివర్'‌- ముమ్మరంగా సహాయక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.