శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలుచేయాలని కోరుతూ రాయలసీమ వ్యాప్తంగా గురువారం విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నామని... రాయలసీమ ఐకాస నాయకులు రవిశంకర్ రెడ్డి కడపలో అన్నారు. ఈ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహాన్రెడ్డి తేలికగా తీసుకుంటే.. ప్రభుత్వం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుందని హెచ్చరించారు. పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోండి అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపైనా స్పందించారు. సీఎంపై ఉన్న కోపాన్ని రాయలసీమ ప్రజలపై వెళ్లబుచ్చటం సరికాదని హితవు పలికారు. సామాజిక బాధ్యత కలిగిన పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మంచిది కాదన్నారు.
ఇదీ చూడండి: