ETV Bharat / state

జమ్మలమడుగులో క్రికెట్ బెట్టింగ్.. ఐదుగురు యువకుల అరెస్ట్

author img

By

Published : Oct 28, 2020, 9:48 AM IST

కడప జిల్లా జమ్మలమడుగులో క్రికెట్ బెట్టింగ్ విచ్చలవిడిగా జరుగుతోంది. తాజాగా మంగళవారం బెట్టింగ్​కు పాల్పడిన ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.

మాట్లాడుతున్న సీఐ
మాట్లాడుతున్న సీఐ

కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా కొనసాగుతోంది. ఇటీవల పెద్దముడియం మండలంలో 11 మందిని అరెస్ట్ చేసి రూ.2.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం రాత్రి జమ్మలమడుగు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడిన ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.32,000లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ సీజన్​లో యువకులు క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతూ...డబ్బులు పొగొట్టుకుంటున్నారని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇదీ చదవండి

ప్రొద్దుటూరులో విజిలెన్స్​ అధికారుల తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.