ETV Bharat / state

పింఛన్ల తొలగింపును ప్రశ్నించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి

author img

By

Published : Jan 6, 2023, 7:38 AM IST

AP Deputy CM Amjad Basha : పింఛన్ల తొలగింపుపై ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషాను ప్రశ్నించినందుకు ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాకుండా ప్రశ్నించిన ఎంఆర్​పీఎస్​ నాయకుడ్ని పరుష పదజాలంతో దుషించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమల్లో వైరల్​గా మారింది

AP Deputy CM
ఉపముఖ్యమంత్రి

AP Deputy CM Amjad Basha : కడపలో వృద్ధాప్య పింఛన్లు తొలగిస్తున్నారని ప్రశ్నించిన ఎంఆర్​పీఎస్​ నాయకుడిపై ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కడపలోని రవీంద్రనగర్‌లో ఉపముఖ్యమంత్రి పర్యటించారు. పర్యటనలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రిని పింఛన్ల తొలగింపుపై ఎంఆర్​పీఎస్​ నాయకుడు ప్రశ్నించారు. కడపలో నాలుగువేలకు పైగా పింఛన్లు తొలగించారని ఎంఆర్​పీఎస్​ నాయకుడు ఉప ముఖ్యమంత్రిని నిలదీశాడు. దీంతో ఆగ్రహంతో ఉపముఖ్యమంత్రి.. ఎవరి పింఛన్లు తొలగించారో చూపించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో దూషించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఎమ్మార్పీఎస్‌ నాయకుడిపై ఉపముఖ్యమంత్రి ఆగ్రహం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.