ETV Bharat / state

సరదా కోసం దిగారు... ప్రాణాలు పోగొట్టుకున్నారు

author img

By

Published : Mar 7, 2021, 7:21 PM IST

two students died in godavari river
సరదా కోసం దిగారు... శవమై తేలారు

ఆదివారం సెలవు కావటంతో సరదాగా గడపటానికి నది తీరానికి వెళ్లారు నలుగురు విద్యార్థులు. స్నానం చేయటానికి నదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు ప్రవాహంలో కొట్టుకుపోయి..మృతి చెందారు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలో గోదావరి నదిలో గల్లంతైన ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు ఉండ్రాజవరం గ్రామానికి చెందిన పట్నాల మణికంట, తణుకు మండలం చెందిన బచ్చల కళ్యాణ్​గా గుర్తించారు.

తణుకులో శశి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు ఆదివారం సెలవు కావటంతో గోదావరి నది వద్దకు వచ్చారు. స్నానం చేసేందుకు నదిలోకి దిగినప్పుడు ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి

ఒకే అమ్మ కడుపున పుట్టినా.. ఆస్తి కోసం రక్తబంధాన్ని తెంచాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.