ETV Bharat / state

బోయలను ఎస్టీలో చేర్చాలి.. లోక్​సభలో రఘురామరాజు

author img

By

Published : Dec 19, 2022, 8:40 PM IST

Raghu Rama Krishna Raju
రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju in Parliament: ఏపీలో ఉన్న బోయలను కూడా కర్ణాటకలో మాదిరిగా ఎస్టీలుగా గుర్తించాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో ప్రస్తావించారు. ఒకే కుటుంబానికి చెందిన వీరిలో కర్ణాటకలో ఉన్నవారు ఎస్టీలుగానూ, ఏపీలో ఉన్నవారు ఓబీసీలుగా చెలామణి అవుతున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.

Raghu Rama Krishna Raju in Parliament: రాష్ట్రంలోని బోయలను ఎస్టీలో చేర్చాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో ప్రస్తావించారు. కర్ణాటకలో ఇదే కులానికి చెందినవారు ఎస్టీ రిజర్వేషన్లు పొందుతుండగా.. ఏపీలో మాత్రం ఓబీసీల్లో చేర్చారని ఆయన వివరించారు. కేంద్రం వీలైనంత త్వరగా బోయలను ఎస్టీల్లో చేర్చాలని ఆయన కోరారు.

ఏపీలో ఉన్న బోయలను ఎస్టీలుగా గుర్తించాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో ప్రస్తావించారు

"కర్ణాటకలో వాల్మీకి కులస్థులు ఎస్టీ జాబితాలో ఉన్నారు. ఏపీలో మాత్రం అదే కులానికి చెందిన బోయలను ఓబీసీ జాబితాలో చేర్చారు. 1956లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందినవారు కర్నూలు చుట్టుపక్కల స్థిరపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వీరిలో కర్ణాటకలో ఉన్నవారు ఎస్టీలుగానూ, ఏపీలో ఉన్నవారు ఓబీసీలుగా చెలామణి అవుతున్నారు. ఏపీలో ఉన్న బోయలను కూడా కర్ణాటకలో మాదిరిగా ఎస్టీలుగా గుర్తించాలంటూ.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిఫారసు చేసింది. వీలైనంత త్వరగా ఈ వ్యవహారాన్ని తేల్చాలంటూ కేంద్రమంత్రి అర్జున్‌ముండాను కోరుతున్నాను. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను". - రఘురామకృష్ణరాజు, ఎంపీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.