ETV Bharat / state

రెడ్ క్రాస్​కు వందేళ్లు.. తణుకు చేరిన సైకిల్ ర్యాలీ

author img

By

Published : Mar 23, 2021, 6:53 PM IST

తణుకులో సైకిల్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే
తణుకులో సైకిల్ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

రెడ్​క్రాస్ సంస్థ ఆవిర్భవించి వందేళ్లు పూర్తైన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.

రెడ్ ​క్రాస్ సంస్థ చేస్తున్న కార్యక్రమాల అవగాహన కోసం శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన ర్యాలీ సోమవారం రాత్రి తణుకు చేరుకుంది. తణుకు నుంచి విజయవాడ వరకు నిర్వహిస్తున్న ర్యాలీని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు.

రెడ్​క్రాస్ సంస్థ చేస్తున్న సేవ, రక్తదాన కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందించారు. ప్రైవేట్ వైద్యులు సైతం ఈసంస్థ ద్వారా రక్తాన్ని అందించేలా సిఫార్సు చేయాలని సూచించారు. 50 శాతం రాయితీపై రక్తం అందించేలా రెడ్​క్రాస్ సంస్థ నిర్ణయించినందున... పేదవారికి ఉపయోగం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.

ఇదీ చదవండి:

యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.