ELECTION RESULTS: పరిషత్ ఎన్నికల్లో వైకాపా హవా

author img

By

Published : Sep 19, 2021, 11:34 AM IST

Updated : Sep 19, 2021, 8:22 PM IST

zptc and mptc election counting at vizianagaram

విజయనగరం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ (zptc, mptc elections) ముగిసింది. పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ ఆదిపత్యం కొనసాగింది. మెజార్టీ స్థానాలను ఆ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.

విజయనగరం జిల్లా పరిషత్ ఫలితాలు
విజయనగరం జిల్లా పరిషత్ ఫలితాలు

విజయనగరం జిల్లాలో పరిషత్​ ఓట్ల లెక్కింపు ముగిసింది. వైకాపా ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. జిల్లాలో వైకాపా 389, తెదేపా 86 ఎంపీటీసీల్లో స్థానాల్లో గెలుపొందాయి. స్వతంత్రులు 11 చోట్ల గెలుపొందగా.. భాజాపా ఓ చోట విజయం సాధించింది. మొత్తం 34 జడ్పీటీసీలలో 3 ఏకగ్రీవం కాాగా.. మిగిలిన 31 చోట్ల వైకాపా విజయం సాధించింది.

జిల్లాలో మొత్తం 549 ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 55 ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఒక ఎంపీటీసీ మరణించగా.. పోలింగ్​కు ముందు పోటీలో ఉన్న అభ్యర్ధుల్లో ఏడుగురు మరణించారు. మొత్తం 487 స్థానాలకు ఎన్నిక నిర్వహించగా.. పోలింగ్ అనంతరం నలుగురు అభ్యర్థులు మృతి చెందారు. అలాగే జిల్లాలో 34 జడ్పీటీసీ స్థానాలకుగానూ 3 సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 31 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.

మొత్తం 34 మండలాలకుగాను 31 చోట్ల కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. దీనికోసం 34 మంది ఆర్వోలు, 88 మంది ఎఆర్వోలులు, 956 మంది కౌంటింగ్ సూపర్​వైజర్లు, 1872 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 75 మంది స్ట్రాంగ్ రూం ఇన్​ఛార్జీలు విధులు నిర్వహించారు. ప్రతీ కౌంటింగ్ కేంద్ర వద్ద కొవిడ్ నిబంధనలు పాటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుడా ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్​ విధించారు.


ఇదీ చదవండి..

Election Counting: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Last Updated :Sep 19, 2021, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.