ETV Bharat / state

కలెక్టర్ చొరవతో వృద్ధ దంపతులకు వైద్య సహాయం

author img

By

Published : May 15, 2021, 6:49 PM IST

వృద్ధులకు తీసుకువెళ్తున్న సిబ్బంది
వృద్ధులకు తీసుకువెళ్తున్న సిబ్బంది

విజయనగరం జిల్లా కలెక్టర్ చొరవతో ఇద్దరు కొవిడ్ బాధిత వృద్ధ దంపతులకు వైద్యసహాయం అందింది. జిల్లా కేంద్ర ఆసుపత్రి సమీపంలోని రాయల్ అపార్ట్​మెంట్​లో అప్పలస్వామి(104), చిన్నమ్మ(98)దంపతులు వారి కుమార్తె ఇంట్లో నివసిస్తుంటారు. అయితే రెండు రోజుల క్రితం వారి అల్లుడు కొవిడ్​తో మరణించారు. కుమార్తె సైతం కొవిడ్ బారిన పడి.. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

విజయనగరం జిల్లా కలెక్టర్ జవహర్ లాల్ చొరవతో ఇద్దరు కొవిడ్ బాధిత వృద్ధ దంపతులకు వైద్య సహాయం అందింది. జిల్లా కేంద్ర ఆసుపత్రి సమీపంలోని రాయల్ అపార్ట్​మెంట్​లో అప్పలస్వామి(104), చిన్నమ్మ(98)దంపతులు వారి కుమార్తె ఇంట్లో నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం వారి అల్లుడు కొవిడ్​తో మరణించారు. కుమార్తె సైతం కొవిడ్ బారిన పడి.. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో వృద్ధులు ఒంటరయ్యారు. వీరికి కొవిడ్ వచ్చిందనే అనుమానంతో ఆహారం, మంచినీళ్లు అందించడానికి కూడా పొరుగు వారు సాహసించలేదు.

అయితే వృద్ధ దంపతుల దూరపు బంధువులు చరవాణీ ద్వారా కలెక్టర్ హరి జవహర్ లాల్​కు సమాచారం చేరవేశారు. ఒంటరిగా ఉంటున్న వారికి వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి సంయుక్త కలెక్టర్ వెంకటరావుకు బాధ్యతలు అప్పగించారు. జేసీ రాయల్​ అపార్ట్​మెంట్​కు చేరుకోని ఆ వృద్ధ దంపతులకు ఆహారం, మంచినీళ్లు ఏర్పాటు చేశారు. నెహ్రూ యువజన కేంద్రం వారి సహకారంతో వారిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ సకాలంలో స్పందించి.. వృద్ధులను వైద్య చికిత్సకు తరలించటంపై వారి బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

నిద్రలో ఉన్నా.. శాశ్వత నిద్రలో కాదు: పరేశ్​ రావల్

మోదీకి కాంగ్రెస్​ నేత గులాం నబీ ఆజాద్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.