చింతపల్లి బీచ్​లో గల్లంతైన యువకుడు శవమై తేలాడు

author img

By

Published : Sep 5, 2021, 10:47 PM IST

మృతదేహం

పూసపటిరేగ మండలం చింతపల్లి బీచ్ లో గత నెల 31న గల్లంతైన నిఖిల్ మృతి చెందాడు. కొవ్వాడ -మెంటాడ పరిధి సముద్ర తీరానికి నిఖిల్ మృతదేహం కొట్టుకువచ్చిందని చింతపల్లి మెరైన్ ఎస్ఐ తారకేశ్వర రావు తెలిపారు.

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి బీచ్ లో గల్లంతైన నిఖిల్ అనే యువకుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ -మెంటాడ పరిధి సముద్ర తీరంలో లభ్యమైనట్లు పోలీసులు గుర్తించారు.


గత నెల 31న చింతపల్లి తీరంలో స్నానం చేసేందుకు జెట్టీ పైనుంచి సముద్రంలోకి దూకి విద్యార్థి నిఖిల్ గల్లంతయ్యాడు. అప్పటి నుంచి వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి రణస్థలం మండలం కొవ్వాడ -మెంటాడ పరిధి సముద్ర తీరానికి నిఖిల్ మృతదేహం కొట్టుకొచ్చిందని చింతపల్లి మెరైన్ ఎస్ఐ తారకేశ్వర రావు తెలిపారు.

ఇదీ చదవండి: suicide:విజయనగరం పీటీసీలో ఎస్ఐ భవానీ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.