ETV Bharat / state

పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ కేసు వేసిన జనసేన నేతపై హత్యాయత్నం

author img

By

Published : Jan 1, 2021, 10:20 AM IST

murder attempt
హత్యా ప్రయత్నం

విజయనగరం జిల్లా సాలూరులో.. జనసేన ఎస్సీ, ఎస్టీ సెల్ లీగల్ అడ్వైజర్ రేగు మహేశ్వరరావును హతమార్చడానికి ఓ దుండగుడు ప్రయత్నించాడు. గుర్తు తెలియని వ్యక్తి కారుతో ఢీకొట్టగా.. చిన్న గాయాలతో ఆయన బయటపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటూ కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది.

ఉపముఖ్యమంత్రి ఎస్టీ కాదంటూ కేసు వేసిన జనసేన నేతపై హత్యాయత్నం

జనసేన నేత, ఎస్సీ ఎస్టీ సెల్ లీగల్ అడ్వైజర్ రేగు మహేశ్వర రావుపై హత్యాయత్నం జరిగింది. ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా సాలూరులో.. గుర్తు తెలియని వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. చిన్న చిన్న గాయాలతో ఆయన బయటపడగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి కారణమైన నిందితుడు సాలూరు పోలీస్ స్టేషన్​లో లొంగిపోయినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటూ... గతంలో కేసు వేసిన వ్యక్తే ఈ రేగు మహేశ్వరరావు. ఆ కేసు విచారణ చేపట్టాల్సిందిగా పశ్చిమగోదావరిలోని ఐటీడీఏ పీఓని.. రెండు నెలలు క్రితం హై కోర్టు ఆదేశించింది. ఆయనపై హత్యాయత్రనం జరగడం అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ చదవండి:

దాడులను జగనే ప్రేరేపిస్తున్నారు... జోక్యం చేసుకోవాలని గవర్నర్​కు చంద్రబాబు లేఖ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.